Sunday, 05 April 2026 06:56:11 PM

భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Date : 21 February 2026 06:25 PM Views : 127

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 21 భీమిలిలోని ఎస్ వి ఎల్ ఎన్ ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భీమునిపట్నంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. పి. సురేఖ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. సి.హెచ్. కేశవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాతృభాష ప్రాధాన్యత, భాషల పరిరక్షణ అవసరంపై వారు ప్రసంగించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. సి.హెచ్. విష్ణుమూర్తి, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డా. ప్రసాద్, ఇంగ్లీష్ అధ్యాపకులు వెంకటరావు, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :