Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : భీమిలి శ్రీ వాసవి కళ్యాణ మండపంలో మార్చి 1వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు భీమిలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ‘సంగీత సుధ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి ఎం. కోటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధమాన గాయనీమణులు కుమారి సిమ్మ షర్మిల, కుమారి సిమ్మ కావ్య అన్నమాచార్య కీర్తనలు, శ్రీమతి టంగుటూరి విశాల సుష్మ త్యాగరాయ కృతులు ఆలపించనున్నారు. కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులు కాళ్ళ సన్నీ, పప్పు భరద్వాజ్, పోలిపిల్లి శ్రీనివాసరావు, కె. మంజుల పాల్గొన్నారు.
Reporter
Neti Sakshyam