Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : మే 26:విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి ప్యాసింజర్ రోప్వే సేవలు వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు నిర్వహణ సంస్థ ప్రకటించింది. రోప్వే నిర్వహణ పనులు, సాఫీ ఆపరేషన్ కోసం మే 26 నుంచి జూన్ 1 వరకు సేవలు నిలిపివేస్తున్నట్లు కన్వేయర్ అండ్ రోప్వే సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్కు లేఖ ద్వారా తెలియజేసింది. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సంస్థ అధికారులు కోరారు.
Admin
Neti Sakshyam