Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మే 28: భీమిలి జమ్మిచెరువు పార్క్లో పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది. లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ పార్క్… ఆలనా పాలన లేక నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. కాపలా దారుల నిర్లక్ష్యమా…? అధికారుల పట్టింపులేమీ లేకపోవడమో…? తెలియదు కానీ… పార్క్లోకి పశువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అందంగా పెంచిన పూల మొక్కలను తినేయడంతో పాటు… వాకింగ్కు వచ్చే ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వెంటనే స్పందించి… పార్క్ నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Reporter
Neti Sakshyam