Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలూరు : ఏలూరు అక్టోబర్ 25 సాక్ష్యం న్యూస్: ఆస్పత్రిలో మందులేక రోగులు ఇబ్బందులు పడుతుంటే,వారిని పట్టించుకోని కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాలను గాలికొదిలేసి మద్యం ఏరులై పారిస్తుందని వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నేత కొల్లేరు సంఘం నాయకులు మోరు రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం పాలసీ అంటే నియోజవర్గంలో ప్రభుత్వం నిబంధన ప్రకారం 20 షాపులు ఉండాల్సి ఉండగా బెల్ట్ షాపులు 120 కి పైగా గ్రామాల్లో ఉండడం మీ ప్రభుత్వానికి కూటమికెర చెల్లిందన్నారు. అమలు చేయని మహిళలకు ఉచిత ప్రయాణం,తల్లికి వందనం ఎక్కడని నిలదీశారు. ఇచ్చిన హామీల్లో ఒక్క పథకానైనా పూర్తి స్థాయిలో అమలు చేశారా అని చంద్ర బాబుపై విరుచుకుపడ్డారు.
Reporter
Neti Sakshyam