Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : నవంబర్ 15 సాక్ష్యం న్యూస్: పద్మనాభం మండలం నర్సాపురం గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన విశాఖ అర్బన్ హౌసింగ్ కాలనీలను జిల్లా కలెక్టరు కె.హరీంద్రపసాద్ పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న కాలనీలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రానున్న రెండునెలలో కాలనీలు ప్రారంభానికి సిద్దం చేయాలని సూచించారు. ఇక నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చూడాలని...హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దారు కె.ఆనందరావు, హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam