Sunday, 05 April 2026 07:00:35 PM

లోక్ అదాలత్ లో 510 కేసులు పరిష్కారం

Date : 14 December 2024 08:49 PM Views : 2121

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : డిసెంబరు 14 సాక్ష్యం న్యూస్:ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకోని పలు కేసులను వాది ప్రతివాదులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని భీమిలి ఒకటవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సౌజన్య అన్నారు. భీమిలి 1వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సివిల్, క్రిమినల్ ఎక్సైజ్‌ల తోపాటు 498(A) STCలు వంటి మొత్తం 510 కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు. వాది ప్రతివాదులు లోక్ అదాలత్ ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యుడు M V పార్వతీశం Adv KSM సుదాకర్,సీనియర్ / జూనియర్‌ లాయర్లు, భీమిలి, ఆనందపురం పోలీసు ఇన్స్పెక్టర్లు,మరియు సామాజిక కార్యకర్త శంకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :