Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : డిసెంబరు 6 సాక్ష్యం న్యూస్ : ఆనందపురం మండలం వేములవలస సచివాలయ ప్రాంగణం,వేములవలస కూడలిలో బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా వైసిపి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముత్తం శెట్టి మహేష్ , జడ్పిటిసి వెంకట్రావు , వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, వైసిపి మండల పార్టీ ప్రెసిడెంట్ బంక సత్యం, వైస్ ఎంపీపీ పాండ్రంకి శ్రీను, డోల ఆనంద్, కోరాడ అప్పలస్వామి నాయుడు మరియు ప్రొఫెసర్ సుబ్బారాయుడు, డివిజనల్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ బోనెల ఏసేపు, దుమ్మెద అప్పలసూరి, జలగడుగుల శ్రీనివాస్, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
Admin
Neti Sakshyam