Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : జై హనుమాన్ అంటూ హిందువులంతా...ఐక్యతను చాటుకోవాలని కేంద్ర మంత్రి GVL నర్శింహరావు పిలుపునిచ్చారు. GVMC పరిధి చిల్లపేటలో జరిగిన శ్రీ వీరాంజనేయ జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్య అథిదిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దైవ భక్తిని పెంపొందించుకుంటూ...హిందు ధర్మాన్ని కాపాడుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఆనందపురం బంటు పల్లి కళ్ళాల నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ కొమ్మాది, మధురవాడ, ఎండాడ,హనుమంతవాక,మీదుగా రామకృష్ణ బీచ్ వరకూ సాగింది. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొనడంతో ర్యాలీ విజయవంతమైంది.
Admin
Neti Sakshyam