Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : సెప్టెంబరు 7 సాక్ష్యం న్యూస్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సొంఠ్యాం శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ్ పాఠశాలలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని అండర్ 17, 19 బాల బాలికలకు జిల్లా స్థాయి ఘట్కా పోటీలను నిర్వహించారు. పోటీలలో అండర్ 17, 19 విభాగాలలో శ్రీ వెంకట్ విద్యా పీఠ్ నుండి 12 మంది బాలికలు, 8 మంది బాలురు, శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి 8 మంది బాలురు, సొంఠ్యము హై స్కూల్ నుండి నలుగురు బాలికలు , ఆకాష్ కాలేజ్ నుండి ఇద్దరు బాలురు మొత్తం 32 మంది బాల బాలికలు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 9, 10 వ తేదీ లలో చిత్తూరు జిల్లాలో జరగనున్న రాష్త్ర స్థాయి ఘట్కా పోటీలలో పాల్గొంటారు.
Reporter
Neti Sakshyam