Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విజయనగరం : ఆగష్టు 8:మెంటాడ మండల కేంద్రంలో బుధవారం మండల టీడీపీ అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయ నృత్యాన్ని అవహేళన చేశారంటూ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. సాక్షి పత్రిక ప్రతులను దహనం చేసి గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచే కథనాలను ఖండించారు. గిరిజనుల మనోభావాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సంబంధిత అంశంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Admin
Neti Sakshyam