Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విజయనగరం/గంట్యాడ : ఆగష్టు 5 : గంట్యాడ మండలం లక్కీడాం జంక్షన్లోని ఇండియా–1 ఏటీఎం చోరీ కేసును త్వరలోనే చేధిస్తామని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ తెలిపారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు సీసీఎస్తో పాటు మొత్తం 10 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఏటీఎంలో సుమారు రూ.1.50 లక్షల నగదు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, శాస్త్రీయ ఆధారాలతో విచారణ కొనసాగుతోందన్నారు.
Admin
Neti Sakshyam