Tuesday, 04 August 2026 07:26:39 AM

పారిశుధ్య కార్మికుడికి జిల్లా పంచాయతి అధికారి భరోసా

Date : 28 September 2024 05:21 PM Views : 484

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : సెప్టెంబరు 28 సాక్ష్యం న్యూస్: పోతునూరు గ్రామపంచాయతీ లో 1992 నుంచి పారిశుధ్య కార్మికునిగా పని చేస్తూ వేతనం రాందక ఇబ్బందులు పడుతున్న కుటుంబరావును ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ భరోసా కల్పించారు. దెందులూరు మండలం పోతునూరు శివారు ఉండ్రాజవరం గ్రామానికి చెందిన మద్దుల కుటుంబరావు 1992 నుంచి పోతునూరు పంచాయతీ కార్యాలయంలో స్వీపరుగా పనిచేస్తున్నారు .అయితే పంచాయతీ సక్రమంగా వేతనాలు ఇవ్వకపోయినా.. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతోనే విధులు నిర్వహిస్తూ... ఏడాది క్రితం మద్ధుల కుటుంబరావు తన భార్యతో కలిసి ఏలూరు జిల్లా పంచాయతీ కార్యాలయంలోని D.PO తూతిక శ్రీనివాస విశ్వనాధ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.స్పందించిన అధికారి తన సమస్యను పరిశీలించడంతోపాటు జీతం వచ్చేలాగా చర్యలు తీసుకున్నారు. ..

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :