Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబర్ 6 సాక్ష్యం న్యూస్: ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్ జి ఎఫ్ అండర్ 17 బాలికల విభాగంలో A.U హైస్కూలులో జరిగిన టైక్వాండో టోర్నమెంట్ క్రీడా పోటీలలో రాష్ట్ర స్థాయి టైక్వాండో క్రీడా పోటీలకు పద్మనాభం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న జి.రమ్యశ్రీ మూడు రోజుల క్రితం ఎంపికైంది.దీంతో తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలలో నేటి నుండి పాల్గొని తలపడుతోందని పాఠశాల ప్రిన్సిపాల్ గ్రేస్ లిల్లి తెలిపారు. ఈ సందర్భంగా రమ్యశ్రీను DEO చంద్ర కళ, GCDO డాక్టర్ కాలేషా బేగం,తదితరులు రమ్యశ్రీ కు అభినందనలు తెలిపారు.
Reporter
Neti Sakshyam