Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : అక్టోబర్ 16 సాక్ష్యం న్యూస్: మండలంలోని ఎన్.ఆర్.ఇ. జి ఎస్ పథకముల ద్వారా రూ.1.65 కోట్ల విలువైన పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం శంకుస్థాపన చేశారు. గంభీరం పంచాయతీలో రూ.30 లక్షలతో బీటీ రోడ్డు, రూ.40 లక్షలతో సీసీ రోడ్డు, వేములవలస సచివాలయం భవనం నుంచి రూ.40 లక్షలతో సీసీ రోడ్డు, బోని నుంచి ఎల్.వి.పాలెం మీదుగా ఆనందపురం మండల కార్యాలయం వరకూ రూ.40 లక్షలతో సీసీ రోడ్డు, పైడితలమ్మ ఆలయం నుంచి తర్లువాడ వరకూ రూ.15 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మూడో రోజు పల్లె పండుగలో భాగంగా ఈ పనులకు శంకుస్థాపనలు చేసారు.
Reporter
Neti Sakshyam