Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : అక్టోబరు 14 సాక్ష్యం న్యూస్; రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండగ వారోత్సవాలను భీమిలి మండలం, ఆర్ తాళ్ళవలసలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆద్వర్యంలో జరిగిన"పల్లె పండగ " వారోత్సవాల్లో భాగంగా ఆర్. తాళ్ళ వలస పంచాయితీ, గొల్లల తాళ్ళవలసలో రూ 30 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు MLA సోమ వారం శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న సిమెంట్ రోడ్లు, కాల్వల నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
Admin
Neti Sakshyam