Sunday, 05 April 2026 10:02:28 PM

ఆర్.వి.పురం Z.P హైస్కూల్లో సహపంక్తి శుభతిది భోజనాలు.

Date : 03 August 2024 04:27 PM Views : 524

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : పద్మనాభం మండలంలో ఆర్.వి.పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్ష సప్తాహ కార్యక్రమంలో బాగంగా శనివారం పాఠశాల హెచ్.ఎం.వి.శంకరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు, గ్రామ పెద్దలకు సహపంక్తి శుభతిది మద్యాహ్న భోజనాలను ఏర్పాటు చేశారు. దీనికి వెంకటాపురం సర్పంచ్ కర్రి వెంకటరమణ, రేవిడి మాజీ ఎంపీటీసీ గంగరాజు ఆర్ధిక సాయం అందించగా..

స్ధానిక ప్రాధమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు సుమారు 400 మంది రుచికరమైన ఆహారాన్ని సంతృప్తిగా బుజించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ గంగరాజు,వైసిపి నాయకులు మరగడ అప్పారావు మరియు ఉపాధ్యయులు పాల్గొన్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :