Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : పద్మనాభం మండలంలో ఆర్.వి.పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్ష సప్తాహ కార్యక్రమంలో బాగంగా శనివారం పాఠశాల హెచ్.ఎం.వి.శంకరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు, గ్రామ పెద్దలకు సహపంక్తి శుభతిది మద్యాహ్న భోజనాలను ఏర్పాటు చేశారు. దీనికి వెంకటాపురం సర్పంచ్ కర్రి వెంకటరమణ, రేవిడి మాజీ ఎంపీటీసీ గంగరాజు ఆర్ధిక సాయం అందించగా..
స్ధానిక ప్రాధమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు సుమారు 400 మంది రుచికరమైన ఆహారాన్ని సంతృప్తిగా బుజించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ గంగరాజు,వైసిపి నాయకులు మరగడ అప్పారావు మరియు ఉపాధ్యయులు పాల్గొన్నారు.
Reporter
Neti Sakshyam