Neti Sakshyam - వార్తలు / అల్లూరి జిల్లా/ అనంతగిరి : అక్టోబరు 20 సాక్ష్యం న్యూస్: అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం మఠంభీమవరం పంచాయితీ లోని మండపల్లి గ్రామంలోని 9 కుటుంబాలకు చెందిన 15 ఆవులు ఓ మేక పిడుగుపాటుకు బలయ్యాయి. వాటిని మేపడం కోసం గిరిజనులు కొండపైకి తోలుకుని వెళ్ళారు. మధ్యాహ్నం 1:00 గంట సమయంలో విపరీతంగా వర్షం కురుస్తూ పెద్ద శబ్దంతో పశువుల మద్య పిడుగు పడింది, దీంతో 15 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆ సమయంలో ఆవులకు దూరంగా ఓ చెట్టు క్రింద ఉన్న ఆ పశువుల కాపరులు ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రభుత్వం తమకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Reporter
Neti Sakshyam