Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబర్ 3 సాక్ష్యం న్యూస్: మండలంలో పలు గ్రామాలలో దుర్గాదేవీ శరన్నవరాత్రుల కార్యక్రమాలు గురువారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. మద్ది, రెడ్డిపల్లి, విజయానందపురం, కృష్ణాపురం, గ్రామాలలో ఏర్పాటు చేసిన మండపాలలో దుర్గాదేవీ విగ్రహాలను అర్చకుల మంత్రోశ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా మద్దిగ్రామ పైడితల్లిమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మునసబు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన దుర్గమ్మ తల్లికి ఎంపీపీ కంటుబోతు రాంబాబు, వైసీపీ యూత్ అధ్యక్షుడు బుగత సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాళ్ల పద్మ,ప్రత్యేక పూజలు జరిపించారు.
Reporter
Neti Sakshyam