Friday, 12 June 2026 03:13:49 AM

గంభీరంలో సచివాలయాన్ని,పాఠశాలను సందర్శించిన MPDO

Date : 20 October 2024 08:38 AM Views : 1083

Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : అక్టోబర్ 19 సాక్ష్యం న్యూస్: మండలంలోని ప్రజలకు ఏ సమస్య తలెత్తినా..వాటిని పరిష్కరించే బాధ్యత తమపై ఉందని ఆనందపురం MPDO జానకి అన్నారు. ఈ నేపథ్యంలో గంభీరం సచివాలయాన్ని, యం.పి.పి పాఠశాలలు, మరియు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను సందర్శించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తేవాలన్నారు.ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, త్రాగు నీరు, డ్రైనేజీ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని ఆయా శాఖల సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కార్యదర్శి చలపతిరావు, పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది పాల్గొన్నారు.

B.Guruvulu ( Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :