Neti Sakshyam - వార్తలు / అల్లూరి జిల్లా/ పెదబయలు : అక్టోబరు 21 సాక్ష్యం న్యూస్: అల్లూరి జిల్లా పెదబయలు మండలం సీతగుంట పంచాయితీ, సీతగుంట జంక్షన్ వద్ద సోమవారం సాయంత్రం వాహనాల తనిఖీ లలో భాగంగా జీపులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించారు. వాహనాన్ని అదుపులోకి తీసుకుని అందులోని 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. నిందితులు పుట్టు మండలం బాబు శాల పంచాయితీ కండ్రంగివలస గ్రామం నికి చెందిన వంతల జయరాం, శిరగం కిరణ్ కుమార్ లుగా గుర్తించారు.
Reporter
Neti Sakshyam