Sunday, 05 April 2026 10:03:18 PM

*ఉచిత మెగా పశు వైద్య చికిత్సా శిబిరం*

Date : 04 August 2024 12:46 PM Views : 436

Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : ఆనందపురం సాక్ష్యం ప్రతినిధి: మండలంలోని బంటుపల్లి కల్లాలు వద్ద జిల్లా పశుగణాభివృద్ధి సంఘం మరియు పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత గర్భ కోసం వ్యాధుల నివారణకు మెగా చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ ఈ శిభిరానికి సుమారు*45* మంది రైతులు తమ పశువులను తీసుకుని వచ్చి ఆయా వ్యాధులకు చికిత్స చేయించుకున్నారు. వీటిలో 30 లేగ దూడలకు నట్టల నివారణకు మందులు ఇవ్వగా 75% రాయితీతో పశుగ్రాస విత్తనాలు కూడా అందించారు.

అంతే కాకుండా 90% రాయితీతో మినీ గోకులం షెడ్లు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని పాడి రైతులు వాటిని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.అనిల్ కుమార్ ఆనందపురం సి ఎ డి డి ఎల్ ల్యాబ్ టెక్నీషియన్ పశువైద్య సహాయకులు ఆఫీస్ సబార్డినేట్, జేడీ. రామకృష్ణ, మరియు రైతులు పాల్గొన్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :