Neti Sakshyam - వార్తలు / అల్లూరి జిల్లా/ పాడేరు : అక్టోబరు 21 సాక్ష్యం న్యూస్: అల్లూరి జిల్లా అన్నవరం పోలీస్ స్టేషను పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 151 కేజీల గంజాయి పట్టుకున్నట్లు చింతపల్లి సీఐ రమేష్ తెలిపారు.ఖచ్చితమైన సమాచారంతో అన్నవరం స్టేషన్ పరిధి బలపం పంచాయితీ సురతుపల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం దాడి చేయగా గోను సంచులతో పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు
Reporter
Neti Sakshyam