Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబరు 4 సాక్ష్యం న్యూస్: భక్తులకు దూరంగా అనంత పద్మనాభుడు అనే శీర్షికతో సాక్ష్యం టివి ప్రసారం చేసిన కథనానికి పాలకులు స్పందించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు కొండపై అనంతుని ఆలయానికి చేరుకుని అక్కడి పరిస్తితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయ పునః నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి కోటి దీపోత్సవానికి భక్తులకు స్వామి దర్శనం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Admin
Neti Sakshyam