Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : అక్టోబరు 21 సాక్ష్యం న్యూస్: ఆనందపురం మండలం గిడిజాల పంచాయతీకి చెందిన శ్రీ మహాలక్ష్మి కల్చరల్ అసోసియేషన్ అధినేత ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ కిడ్నీ బాధితునికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయమందించి పలువురి మన్ననలు పొందారు. వేములవలస గ్రామానికి చెందిన బోనేల ఈశ్వరరావు (52)కు కిడ్నీలు దెబ్బతిన్నాయని తెలుసుకున్న ఘట్టమనేని బాధితుని పరామర్మించారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబానికి 25 వేల రూపాయలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
Reporter
Neti Sakshyam