Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబరు 7 సాక్ష్యం న్యూస్: దెందులూరు ఎంపీడీవో గా K. శ్రీదేవి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. కామవరపుకోట ఎంపీడీవో గా పని చేసిన శ్రీదేవి దెందులూరు మండలానికి బదిలీపై వచ్చారు. గతంలో పెదవేగి ,ఏలూరు, దెందులూరు మండలాల్లో ఎంపీడీవో గా పని చేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మండల అభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని కోరారు.
Reporter
Neti Sakshyam