Neti Sakshyam - వార్తలు / ఏలూరు : ఏలూరు సిటీ సాక్ష్యం ప్రతినిధి: తమ భార్యలను కాపురానికి పంపించాలంటూ ఏలూరు జిల్లా కలక్టరేట్ వద్ద ఇద్దరు తొడల్లుళ్ళ రిలే నిరాహార దీక్షకు దిగారు. తమకు పెళ్లిళ్లు అయ్యాక తమ ఇద్దరు భార్యలను కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్ళ పై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారంటూ..ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు ఆ అళ్లుళ్ళు. తమ శాడిస్ట్ మామ బికె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ...ఏలూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు దిగడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. మోసపోయామంటూ ఇద్దరు తోడు అల్లుళ్లు మీడియా ముందు తమ బాధను వెళ్ళగక్కారు.
Reporter
Neti Sakshyam