Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : జోగన్నపాలెం మధ్యాహ్న భోజన వికటించ నవంబర్ 21 ,సాక్ష్యం న్యూస్ దెందులూరు మండలం జోగన్నపాలెం గ్రామంలో ఎంపీపీ పాఠశాలలో 9 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకుని అస్వస్థకు గురి కావడం బాధాకరమని దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొఠారు ఆదిశేషు అన్నారు. జోగన్నపాలెం గ్రామంలో ఎంపీపీ పాఠశాలలో అస్వస్థకు గురైన విద్యార్థులను ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వపసుపత్రిలో ఆయన పరామర్శించారు. ఘటన జరిగిన వివరాలను వారి కుటుంబ సభ్యుల వద్ద అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు.
Reporter
Neti Sakshyam