Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : అక్టోబర్ 3 సాక్ష్యం న్యూస్: చిట్టివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండలస్థాయి చెకుముకి సైన్స్ పోటిల్లో భీమిలి సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం 8,9,10 తరగతుల విద్యార్థులు చింతపల్లి జస్వంత్, కడలి నీరజ్, ఎర్రాజీ, గురు విష్ణులు ప్రతిభను చాటుకున్నారు. దీంతో ఈ నెల 27న విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరగనున్న జిల్లా స్ధాయి పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ క్రిస్టీ జాన్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ త్రిసా మేరీ ప్రిన్సిపల్ సిస్టర్ క్రిస్టీ జాన్ ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.
Reporter
Neti Sakshyam