Neti Sakshyam - వార్తలు / విశాఖపట్నం : సెప్టెంబర్ 13 సాక్ష్యం న్యూస్: గ్రేటర్ మహా విశాఖపట్నం నగరంలో 12 వ వార్డు పరిధి పెదగదిలి గ్రామం ఎస్.సి.కాలనీలో వినాయక నవరాత్రుల సందర్భంగా శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని స్ధానిక యువకులు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్ధానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పార్లమెంటు టీడీపీ ఎస్.సి.సెల్ అధ్యక్షుడు బుడిమూరి గోవింద,కమిటీ సభ్యులు ఎస్.సత్యనారాయణ, శ్రీనివాస్, వెంకట్, జాన్,తదితరులు స్వామివారికి విశేష పూజలు చేసారు. మద్యాహ్నం మండపం వద్ద బారీ అన్నసమారాధన కార్యక్రమం చేపట్టడంతో భక్తులు బారులుతీరారు.
Reporter
Neti Sakshyam